టాలీవుడ్ లో అద్భుతమైన సక్సస్ ట్రాక్ ని మేయిన్టైన్ చేస్తున్న డైరెక్టర్ కొరటాల శివ. దర్శకుడిగా ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబు తో భరత్ అనే నేను తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సాధించారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ వంటి క్రేజీ కాంబినేషన్ లో ఆచార్య రూపొందుతుంది. 40 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కరోనా తో లాక్ డౌన్ లో లాకయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆచార్య ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలంటే కొరటాలకి పెద్ద సవాల్ గా మారింది. చిరంజీవి లేకుండా కనీసం సీన్స్ తీద్దామన్నా వీలు పడటం లేదు. ఇక హీరోయిన్ గా కాజల్ నటిస్తున్నప్పటికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేలా అనిపించడం లేదట. ఇక ఈ సినిమాలో చరణ్ మెగాస్టార్ మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. కాని చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొనడానికే ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదు.
ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత కొరటాల శివ విజయ్ దేవరకొండ తో సినిమా తెరకెక్కిందుకు కమిటయ్యాడు. కొరటాల రేంజ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించడానికి కొరటాల మంచి యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో కథ సిద్దం చేశారట. వీలైనంత త్వరగా ఆచార్య ని కంప్లీట్ చేసి విజయ్ దేవరకొండ సినిమా మొదలు పెట్టాలన్న ప్లాన్స్ తో ఉన్నాడు కొరటాల. కాని ఆచార్య లో కూరుకుపోయాడు.
అలాగే విజయ్ దేవరకొండ పురి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. పూరి, ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాని ఈ సినిమాలో విజయ్ ఇరుక్కొని బయటకు రాలేకపోతున్నాడు. కరోనాతో లాక్ డౌన్ లో లాకయ్యి ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు తమ ప్రాజెక్ట్స్ కంపీటయ్యాక కొత్త ప్రాజెక్ట్ లోకి వస్తారు. అయితే ఈ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో కొరటాల వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!