Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ `రాధేశ్యామ్` కోసం కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని గోపీ కృష్ణా మూవీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
1970లలో జరిగే ఈ వింటేజ్ ప్రేమ కథా చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులున్న హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ఆయన గురువు పరమహంసగా కృష్ణంరాజు నటించారు. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే మెరిసింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణంరాజు.. రాధేశ్యామ్ సినిమాతో పాటు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇందులో పరమహంస పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రను చూస్తే వివేకానందుడు .. రామకృష్ణ పరమహంస మాదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్రను చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే ప్రభాస్ రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తుండడం ఫ్యాన్స్కి నచ్చడంలేద. కానీ, ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేయబోతున్నాడని కృష్ణం రాజు పేర్కాన్నారు. ఇక ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రాగా.. ఆ శుభ తరుణం త్వరగా రావాలనే నేనూ ఆశిస్తున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుని పిల్లలను కంటే.. వాళ్లతో ఆడుకోవాలనుంది. అది నా కోరిక అంటూ చెప్పుకొచ్చారు. మరి ప్రభాస్ విషయంలో కృష్ణంరాజు కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!