టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించడం జరిగింది. బండ్ల గణేష్ తన కామెడీతో పెద్దగా మెప్పించలేకపోయిన కానీ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం జరిగింది. చాలా వరకు మెగా హీరోల సపోర్టు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు బండ్లగణేష్ కి ఉండటంతోనే…. ఇండస్ట్రీలో బండ్లగణేష్ నిర్మాతగా రాణించారు అని చాలామంది చెబుతారు.
అటువంటి బండ్లగణేష్ ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆలీతో ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారిన సమయంలో పవన్ కళ్యాణ్ – పూరి కాంబినేషన్ లో సినిమా చేయాల్సి ఉండగా ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ పనుల్లో పవన్ బిజీగా ఉండటంతో ఫస్ట్ సినిమా రవితేజ తో తీసినట్లు చెప్పారు. ఆంజనేయులు అనే సినిమా చేశాను కానీ సినిమా పెద్దగా రాణించలేక పోయింది అని అన్నారు. ఆ తరువాత మా బాస్ పవన్ కళ్యాణ్ గారి తో తీన్మార్ సినిమా చేశాను అది సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ…. పవన్ కళ్యాణ్ గారే తనని పిలిచి “గబ్బర్ సింగ్” అనే సినిమాని నాకు ఇచ్చారు బ్లాక్ బస్టర్ అయ్యింది అని తెలిపారు.
ఇదిలా ఉండగా డైరెక్టర్ కృష్ణవంశీ తో గోవిందుడు అందరివాడేలే సినిమా నిర్మాణ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా గొడవ అయింది అన్న ప్రశ్నకి బండ్ల గణేష్ చాలా లైట్ గా సమాధానమిచ్చారు. ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గారని బండ్ల గణేష్ తెలిపారు. ఖచ్చితంగా సినిమా నిర్మిస్తున్న సమయంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం సహజం ఆ రీతిగానే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ పెద్దది కాలేదని అన్నారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణవంశీగారి తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాను అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మరో పెద్ద ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నాను అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.