Krithi Shetty: కృతి శెట్టి.. ప్రస్తుతం యూత్ ఫేవరెట్ గా మారిపోయింది. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సైతం విజయం సాధించాయి.
దీంతో కెరీర్ స్టార్టింగ్లోనే హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న లక్కీ హీరోయిన్గా కృతి శెట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగుతో పాటు తమిళం నుంచీ సైతం ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ, వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా.. తన పాత్ర వైవిధ్యంగా ఉంటేనే సైన్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ బ్యూటీ రెండు నెలల్లో రెండు సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం కృతి చేతిలో ఉన్నా ప్రాజెక్ట్స్లో `ది వారియార్` ఒకటి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్గా చేయగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలాగే కృతి శెట్టి నితిన్తో ఓ మూవీ చేస్తోంది. అదే `మాచర్ల నియోజవర్గం`. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు దర్శకనిర్మాతలు. మూవీ కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు మాచర్ల నియోజవర్గం రాబోతుందని ప్రకటించారు. దీంతో కృతి శెట్టి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.