Kriti Sanon: బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని టాప్ హీరోయిన్ గా కృతిసనన్.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. దాదాపు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న చాలా టాప్ మోస్ట్ ప్రాజెక్టులలో.. ప్రభాస్ నటిస్తున్న “ఆది పురుష్” పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ మోస్ట్ హీరోయిన్లు ఇప్పుడు సౌత్ సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. “బాహుబలి” తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా వరకు సౌత్ సినిమాలను రీమేక్ లు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అంతమాత్రమే కాదు బాలీవుడ్ టాప్ హీరోలు సైతం సౌత్ డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆలియాభట్ అయితే ఏకంగా ఇటీవల.. విడుదలైన “ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా చేసి సినిమా హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషించడం మనకు తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కృతిసనన్.. సౌత్ లో మరియు ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని మార్కెట్ ఉన్న స్టార్ హీరో విజయ్ సరసన నటించడానికి రెడీ అయినట్టు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. పూర్తి విషయంలోకి వెళితే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో దళపతి విజయ్… పాన్ ఇండియా సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నీ తీసుకోవడానికి సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే.. కృతి సనన్ తో మంతనాలు జరిపినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. గతంలో కృతి సనన్ … తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “వన్”లో నటించడం జరిగింది. కానీ వన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత పూర్తిగా కృతిసనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ సౌత్ వైపు చూస్తున్నట్లు విజయ్ ప్రాజెక్టు ఓకే చేయనున్నట్లు టాక్.