బాలీవుడ్ తార కృతిసనన్కి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాధి దేశాన్ని బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ వ్యాధి సోకుతుంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా బాలీవుడ్ చెందిన చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కూడా కృతి సనన్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కృతి అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆది పురుష్’లో సీతగా నటించనుందని వార్తలు వస్తున్నాయి.
కృతి తెలుగులో చాలా చిత్రాలలో నటించింది. మహేష్ బాబు వన్..నేనొక్కడినే చిత్రంతో పాటు నాగచైతన్య దోచెయ్ సినిమాలో నటిచింది. నటించిన సినిమా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో పాగా వేసింది. అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలా సినిమాలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్లోని పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’ సినిమాలో సీతగా కృతి నటుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతితో పాటు కీర్తి సురేష్ ,ఊర్వశీ రౌటేలా ఈ సినిమాలో నటిస్తున్నరనే వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఆదిపురుష్ చిత్రం భారతీయ పురాణ గాథా ఇరామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అన్ని ప్రముఖుల భాషల్లో నిర్మించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. సినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చేయనున్నారు. లక్ష్మణుడి పాత్రతో పాటు ఇతర భరతుడు,శత్రుజ్ఞుడు పాత్రలో ఎవరు నటిస్తున్నరనే దానిపై క్లారీటి లేదు. కైక పాత్రలో ప్రముఖ సీనియర్ నటి నటించనున్నట్లు తెలుస్తోంది.