Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో మాత్రమే సినిమాలు చేసినా గాని ఆయన క్రేజ్ మాత్రం సౌత్.. నార్త్ అనే సరిహద్దులు లేకుండా వ్యాపించి ఉంది. చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు మహేష్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టపడతారు. ఇదే తరుణంలో మహేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకి సై అంటే చాలు చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ చెప్పడం జరిగింది. అంత క్రేజ్ కలిగిన మహేష్ బాబు తో బాలీవుడ్ ఇండస్ట్రీ బామ్మ కృతిసనన్ సినిమా చేయాలని ఉందని ఇటీవల మనసులో మాట ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
గతంలో ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు తో “వన్ నేనొక్కడినే” అనే సినిమా చేయడం జరిగింది. సినిమాలో .. చాలా క్యూట్ గా కనిపించి.. తెలుగు ప్రేక్షకులను అలరించడం జరిగింది. కాగా మరోసారి మహేష్ బాబు తో నటించాలని తాజాగా ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఇంకా అనేక విషయాల గురించి తెలిపింది. కెరీర్లో పరాజయం ఎదురైతే మనసులో పెట్టుకోకు అని తెలిపింది.
Read More: Mahesh Babu: మహేష్ బాబు ని ఆకాశానికి ఎత్తేస్తున్న జాతీయ మీడియా ఛానల్స్..!!
అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల నుండి జీవితంలో జరుగుతున్న ప్రతి అనుభవం గురించి ఒక బుక్కు రాస్తున్నానని .. ప్రతి ఫైవ్ ఇయర్ కి సంబంధించి తన దగ్గర బుక్ ఉంటుందని తర్వాత వాటిని మెమరీస్ గా ఆస్వాదిస్తాను అని కృతి సనన్ తెలిపింది. అదే రీతిలో ఆది పురుష్ సినిమాలో చేయటం.. ఎంతో ఆనందాన్ని కలిగించిందని సినిమా సెట్లో ఉన్నంతసేపు బాగా ఎంజాయ్ చేసినట్లు స్పష్టం చేసింది.