Ponniyin Selvan: డైరెక్టర్ మణిరత్నం అందరికీ సుపరిచితుడే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకుడిగా.. క్రేజ్ ఉన్న మణిరత్నం రొమాంటిక్ సినిమాలు తీయటంలో ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సినిమాలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటిగా డైరెక్టర్ మణిరత్నం ఆధ్వర్యంలోనే తెరకెక్కటం జరిగాయి. ఇతరహాలోని ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఇక ఇదే సమయంలో హీరోయిన్ ఖుష్బూ చేసిన కామెంట్స్ ‘పొన్నియిన్ సెల్వన్’ కి పొలిటికల్ టచ్ ఇచ్చేటట్లు మారాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ మణిరత్నంపై పొగడ్తల వర్షం కురిపించారు. చరిత్రను రెండున్నర గంటల్లో చూపించటంలో డైరెక్టర్ మణిరత్నం విజయం సాధించారని పేర్కొన్నారు. రాజరాజ చోళులను హిందువులుగా చూపారంటూ కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చేసిన కామెంట్లను కుష్బూ తప్పు పట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ల మైండ్ సెట్ మారాలని తెలిపారు.
‘పొన్నియిన్ సెల్వన్’ ఐదు రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న క్రమంలో ఎవరో విమర్శాత్మకమైన రివ్యూలు ఇచ్చిన పెద్దగా నష్టం ఏమీ ఉండదని కుష్బూ తెలిపారు. చరిత్రను మార్చడం ఎవరి తరం కాదు. పైగా మణిరత్నం వంటి దర్శకులు అటువంటి పనులు చేయరు అని తెలిపారు. అత్యంత ప్రజాదారణ పొందిన ఓ నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ తెరకెక్కింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30వ తారీకు విడుదలయి విజయవంతంగా ప్రదర్శరితవుతుంది.