దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి ఎంట్రీ తర్వాత చోటు చోసుకున్న వ్యక్తిగత, రాజకీయ పరిణామాలపై రాంగోపాల్ వర్మ రూపొందిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈ సినిమా తమ పార్టీకి రాబోయే ఎన్నికల్లో నష్టం కలిగించేలా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎలక్షన్ కమీషన్కు పిర్యాదు చేశారు. అయితే ఇది తమ పరిధిలోకి రాదని.. హైకోర్టు పరిధిలోకి సమస్యను ఉంచింది ఎలక్షన్ కమీషన్. హై కోర్టు స్పెషల్ బెంచ్ త్వరలోనే ఈ సినిమాను వీక్షించనుందట. తర్వాతే సినిమాను పోస్ట్ పోన్ చేయాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తుందట కమీషన్. కానీ జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినా.. అన్నీ హంగులు పూర్తి చేసుకుని వెళ్లడానికి వారం రోజుల సమయం పడుతుంది. లేదా హైకోర్టు స్పెషల్ బెంచ్ సినిమాను ఎన్నికలు తర్వాత విడుదల చేయమంటే ఇక చేసేదేమీ ఉండదు.
previous post
next post