కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తుంది. దీని భారిన పడుతున్న సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ధనిక, పేద, రాజకీయ, చిత్ర పరిశ్రమలేమి దీనికి అతీతం కాదు. అందరు సమానమే. తాజాగా దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్, జూనియర్ చిరు కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘన రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు.
“అమ్మ నాన్న, నాకు కోవిడ్ లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. కోవిడ్ నిర్ధారణ అవటంతో చికిత్స పొందుతున్నామని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు తెలిపారు.
సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు కన్నడ నటుడు చిరంజీవి దాదాపు 22 సినిమాల్లో నటించాడు. చిరు, మేఘన రాజ్ ను ప్రేమించి 2018 మే రెండున పెళ్లి చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ 7న చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించాడు. అప్పటికే చిరు భార్య మేఘన గర్భవతి అనే సంగతి తెలిసిందే. భర్త మరణించటంతో చిరు కటౌట్ ను పక్కన పెట్టుకుని శ్రీమంతం చేసుకుంది మేఘన. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఆమె అక్టోబర్ లో మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం అందరి ఆరోగ్యం, ముఖ్యంగా జూనియర్ చిరు ఆరోగ్యం బాగుందని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరారు. తమను కలిసిన ప్రతి ఒక్కరు కూడా నిర్లక్షణ చేయకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.