Jhanvi Kapoor: భారతదేశ చలనచిత్ర రంగంలో హీరోయిన్ గా శ్రీదేవి ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి శ్రీదేవి తన వారసత్వాన్ని పెద్ద కూతురు జాహ్నవి కపూర్ నీ… హీరోయిన్ గా వెండితెరకి పరిచయం చేయడం జరిగింది. “ధడక్” అనే సినిమాతో జాన్వీ కపూర్ నటనకు ప్రాధాన్యత కలిగిన సినిమాతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. కానీ కూతురు సినిమా రిలీజ్ అయిన టయానికి శ్రీదేవి చనిపోవడం తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి ఎన్టీఆర్ నుండి చిరంజీవి తరం వరకు పెద్ద పెద్ద హీరోల సరసన నటించడం జరిగింది. దీంతో తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉన్న శ్రీదేవి.. తన కూతురిని కూడా ఇక్కడ లాంచ్ చేయాలని అప్పట్లోనే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో.. జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాలో… జాన్వి కపూర్ నీ నటింపజేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగినట్లు కూడా టాక్.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఈసారి విజయ్ దేవరకొండ తో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ పూరీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు ఆ సినిమాలో.. జాన్వి కపూర్ నీ తీసుకునే ఆలోచనలో పూరి టీం ఉన్నట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా కి మళ్ళీ పూరి జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరించినున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న లైగర్ కి దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా పూరి రాణిస్తున్నారు. అదే రీతిలో జాన్వి కపూర్ హీరోయిన్ సినిమాకి పూరి రాణించనున్నట్లు టాక్.