Rajamouli Udaykiran: హీరో ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితుడే. తేజ దర్శకత్వంలో “చిత్రం” సినిమాతో.. హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఉదయ్ కిరణ్… లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన ఉదయ్ కిరణ్ సినిమాలకు అప్పట్లో అమ్మాయిలు థియేటర్లకు తండోపతండాలుగా వచ్చేవాలు. చాలామంది టాప్ మోస్ట్ దర్శకులతో అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమాలు చేయడం. అయితే రాజమౌళి దర్శకత్వంలో కూడా ఉదయ్ సినిమా చేయాల్సి ఉండగా అది మిస్ అయినట్టు తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇండియాలోనే టాప్ మోస్ట్ దర్శకుడు రాజమౌళి అని అందరికీ తెలుసు. రాజమౌళితో సినిమా చేయడానికి మనదేశంలోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. బాహుబలి 2, RRR తో రాజమౌళి రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఈ సినిమాలకు ముందు రాజమౌళికి కేవలం తెలుగులోనే మార్కెట్ ఉండేది. అయితే అప్పట్లో తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో నితిన్ నటించిన “సై” ప్రాజెక్ట్ స్టోరీ మొదట జక్కన్న ఉదయ్ కిరణ్ కి వినిపించారట. అయితే ఉదయ్ కిరణ్ టైం కావాలని అనటంతో… రాజమౌళి నితిన్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. “రగ్బీ” నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది.
నితిన్ కెరియర్ కి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. అటువంటి ఈ సినిమా ఉదయ్ కిరణ్ మిస్ అయినట్లు ఒకవేళ చేసి ఉంటే ఉదయ్ కి కొంచెం మాస్ ఇమేజ్ వచ్చేదని.. తాజా వార్త పై నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. చాలావరకు లవ్ స్టోరీ సినిమాలు చేసి.. రొటీన్ హీరోగా మారటంతో పాటు తర్వాత కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో… ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోవటం తెలిసిందే. నిజంగా జక్కన “సై” సినిమా..ఉదయ్ కి పడితే అతని కెరీర్ మరోలా ఉండేదని ప్రస్తుతం… ఇంకా ఇండస్ట్రీలో కొనసాగే వాడని ఈ వార్తపై మరికొంత మంది రియాక్ట్ అవుతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!