F3: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన చిత్రం `ఎఫ్ 3`. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. సునీల్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలను పోషించారు.
2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ`ఎఫ్ 2`కు సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 27న గ్రాండ్గా రిలీజ్ అయింది. కథ పెద్దగా లేకపోయినా.. ఆద్యంతం కామెడీగా సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి గిలిగింతలు పెడుతూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబడుతోంది. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్లో విడుదలైన ప్రతి చిత్రం మళ్లీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందులోనూ ఈ మధ్య కేవలం మూడు, నాలుగు వారాల్లోనే ప్రతి సినిమాను ఓటీటీలోకి దింపేస్తున్నారు. దాంతో ఏదైనా సినిమా విడుదలైతే ఓటీటీలో చూడొచ్చులే అని థియేటర్స్కు కదలడం మానేస్తున్నారు. ఈ లిస్ట్లో మీరు ఉన్నారా..? `ఎఫ్ 3` ని ఎంచక్కా ఒటీటీలో చూడాలని భావిస్తున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్.
అదేంటంటే.. `ఎఫ్ 3` ఇప్పట్లో ఓటీటీలోకి రాదట. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ తెలియజేశారు. ఇందులో భాగంగానే అనిల్ రావిపూడి, వెంకటేశ్, వరుణ్ తేజ్ లు ఒక వీడియో చేసి వదిలారు. ఈ వీడియోలో తమ మూవీని థియేటర్లో చూసి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని అనిల్ రావిపూడి తెలిపారు. ఆపై వెంకీ-వరుణ్లు మాట్లాడుతూ.. ఎఫ్ 3ని థియేటర్లో చూడకపోయినా 4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని అనుకోవద్దని, 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సినిమాను ఓటీటీలో చూడొచ్చు అని భావించిన ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లినట్టు అయింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!