Rajamouli Mahesh: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ లతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. జక్కన్న తో సినిమా చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు బాలీవుడ్ టాప్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన “ఆర్ఆర్ఆర్” ప్రజెంట్ రికార్డుల వేట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25 వ తారీకు రిలీజ్ అయిన ప్రతీచోటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్లతో.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త లెక్కలు సెట్ చేసే పనిలో ఉంది. ఈ సినిమాలో రాజమౌళి టేకింగ్… విజువల్ వండర్.. చూసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టినట్లు అయింది.
సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు రాజమౌళి డైరెక్షన్ కి ఫిదా అయిపోయారు. ఎటువంటి దర్శకుడి ఇండియాలో అది టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా గ్రేట్ అని గర్వపడుతున్నామని కొంతమంది టాప్ హీరోలు సైతం కామెంట్ చేయడం జరిగింది. కాగా అటువంటి రాజమౌళి దర్శకత్వంలో ఇప్పుడు మహేష్ సినిమా తెరకెక్కనున్న క్రమంలో… మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ సినిమా బాహుబలి, “ఆర్ఆర్ఆర్” సినిమాల కంటే భారీ బడ్జెట్ సినిమా అని జక్కన్న ఇటీవల పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే రీసెంట్ ఇంటర్వ్యూలో… మహేష్ సినిమా స్టోరీ యాక్షన్ అడ్వెంచర్ ఈ నేపథ్యంలో ఉంటుందని ప్రజెంట్ రెండు స్టోరీలు లాక్ చేయడం జరిగిందని.. త్వరలోనే ఫైనల్ లైవ్ చేస్తామని రాజమౌళి తెలియజేశారు. దీంతో ఈ వార్త విన్న ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆల్రెడీ సినిమా స్టోరీ గురించి అంతకు ముందు రైటర్ విజయేంద్రప్రసాద్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కే సినిమా… అని చెప్పటంతో పాటు ఇప్పుడు రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ అని తెలియజేయడంతో… సినిమా పై మరింత ఇంట్రెస్ట్ అభిమానుల్లో నెలకొంది. గ్యారెంటీగా మహేష్ కెరియర్ లో.. గుర్తుండిపోయే సినిమా అవుతుందని.. ఫిలిం వర్గాలు అంటున్నాయి.