నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ నెల 19న `కాంచన 3`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో మంచి మనసున్న వ్యక్తిగా పేరున్న లారెన్స్ తన చారిటీ ద్వారా చిన్న పిల్లల గుండె జబ్బులకు ఆపరేషన్ చేయిస్తుంటారు. అలాగే కొంత మంది అనాథలకు కూడా చేయూతనందిస్తున్నారు. తాజాగా మరోసారి లారెన్స్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చెన్నై నగరంలో మింజూర్ ప్రాంతంలోని కోటిన్నర రూపాయల విలువ చేసే తన 1.25 గ్రౌండ్ స్థలాన్ని ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీకి భూ విరాళంగా అందించారు. మార్చి 31న ఇంటర్నేషనల్ ట్రాన్స్ జెండర్ డే సందర్భంగా లారెన్స్ భూ విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఈ స్థలంలో నివాస సౌకర్యం లేని ట్రాన్స్ జెండర్స్ కోసం ఓ బిల్డింగ్ను కట్టబోతున్నారట.
previous post
next post