Raai Laxmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అందరిని అలరించిన లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. బాలకృష్ణ సరసన అదినాయకుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ విధంగా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోషూట్ జరుపుకొని అభిమానులకు మత్తెక్కిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ నటించిన సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. ఈమె సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ అభిమానులకు దగ్గర అవుతుంటారు. తాజాగా ఈమె ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడటంతో గాలికి బాగా గాయమైంది. ప్రస్తుతం తన గాయానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్వీన్ ఆఫ్ ఇంజురీస్:
రాయ్ లక్ష్మి ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఈ షూటింగ్ లో భాగంగానే మార్చి 20 బంజారాహిల్స్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా రాయ్ లక్ష్మి ప్రమాదానికి గురైంది.ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాయ్ లక్ష్మీకి గాయాలైనట్లు తెలుస్తుంది. కాలికి బలమైన గాయం తగిలింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను లక్ష్మి స్వయానా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక్కసారిగా ఈమె కింద పడడంతో చిత్ర బృందం సభ్యులు గట్టిగా కేకలు వేస్తూ అక్కడికి చేరుకొని ఆమెను పైకి లేపారు. ఈమె కాలికి బలంగా గాయం కావడంతో షూటింగుకు ప్యాకప్ చెప్పి లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. తన కాలికి గాయం అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “క్వీన్ ఆఫ్ ఇంజురీస్” అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే లక్ష్మి ఈ విధంగా గాయపడటం ఇది మొదటిసారి కాదు. ఇదివరకే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.