డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో “లైగర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 25వ తారీకు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో “లైగర్” సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసేసారు. దీనిలో భాగంగా ఈరోజు “లైగర్” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించి రెండు చోట్ల జరుపుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఉదయం 9:30 గంటలకు మెగాస్టార్ చిరంజీవి మరియు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా “లైగర్” తెలుగు ట్రైలర్ రిలీజ్ కానుంది.
“లైగర్” ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్, చిరంజీవి..!!
ఇక సాయంత్రం ముంబైలో “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నట్లు టాక్. ఆ హీరో మరెవరో కాదు రణవీర్ సింగ్. నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఆధ్వర్యంలో “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. దీంతో కరణ్ జోహార్ విజ్ఞప్తి మేరకు రణవీర్ సింగ్ తో పాటు మరి కొంతమంది హీరోలు ఈ హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
“లైగర్” కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫోటోలు మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ఫోటోతో సినిమాకి మంచి ప్రచారం రావడం జరిగింది. అయితే మరి కొద్ది గంటల్లో విడుదల కాబోయే ట్రైలర్.. మరిన్ని సంచలనాలు సృష్టించడం గ్యారెంటీ అని సినిమా యూనిట్ బలంగా నమ్ముతుంది.