డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా “లైగర్”. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. గత నెలలో “లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు రెండు చోట్ల జరిగాయి. ట్రైలర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. ఇదే సమయంలో “లైగర్” ఆటలు కూడా మరో పక్క విడుదల చేస్తూ ఉన్నారు. సాంగ్స్ కీ కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం తర్వాత చాలావరకు “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు నార్త్ ఇండియా లోనే జరిగాయి. ప్రారంభంలో ముంబై ఆ తర్వాత పూణే, గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో జరగగా తాజాగా ఇప్పుడు నార్త్ ఇండియాలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి.
ఆగస్టు 13వ తారీకు నుండి “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు. షెడ్యూల్ చేస్తే ఆగస్టు 13వ తారీకు చెన్నై, ఆగస్టు 14 వ తారీకు వరంగల్, ఆగస్టు 15వ తారీకు హైదరాబాద్, ఆగస్టు 17వ తారీకు ఇండోర్, ఆగస్టు 18 కొచ్చి, ఆగస్టు 19వ తారీకు బెంగళూరు, ఆగస్టు 20 గుంటూరు, ఆగస్టు 21 మరియు 22వ తారీకు ఢిల్లీ ఇంకా ఆగస్టు 23వ తారీకు వచ్చేసరికి వారణాసిలో “లైగర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షెడ్యూల్ రూపొందించారు. అయితే ఆగస్టు 11 నార్త్ ఇండియాలో పూణే, ఇంకా 13వ తారీకు చండీగర్ లో ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత దక్షిణాదిలో “లైగర్”టీం అడుగుపెట్టనుంది.
వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పైనే ఆశలు పెట్టుకోవడం జరిగింది. సినిమాలో చాయ్ వాలా లాగా ఇంకా ఇంటర్నేషనల్ బాక్సర్ గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరి ఈ సినిమాకి వ్యవహరించారు. మరో నిర్మాతగా బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా “లైగర్” నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలిపారు. పారి అంచనాల మధ్య ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. మరి వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ని “లైగర్” ఏం చేస్తుందో చూడాలి.