Ram Charan : ప్రస్తుతం రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో RRR చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తూనే మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. రెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో తన తదుపరి సినిమా సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ లైన్ లో పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తూ ఉన్నారు. భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని లైకా అనే చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.
అయితే “ఇండియన్ టూ” సినిమా షూటింగ్ విషయంలో శంకర్ లేట్ చేయటం మాత్రమే కాక అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నట్లు.. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సినిమా మొత్తం పూర్తయ్యేంతవరకు మరో సినిమా శంకర్ చేయకూడదు అంటూ..పిటిషన్లో తెలిపారు. దాదాపు సినిమా షూటింగ్ 80% అయిపోగా ఇంకా 20% కోసం శంకర్ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
180 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఇప్పటివరకు 246 కోట్ల రూపాయలు ఖర్చు చేయించినట్లు స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మద్రాస్ హైకోర్టు ఇండియన్ టూ చిత్ర నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ ని కొట్టిపారేసింది. శంకర్ ఈ సినిమా కంప్లీట్ అవ్వకుండానే మరో సినిమా స్టార్ట్ చేయొచ్చు అన్న తరహాలో వాదనలు విన్న జడ్జి పిటి ఆషా శంకర్ వేరే సినిమా చేయకుండా స్టే ఇవ్వటాన్ని కొట్టి పడేశారు. సో మొత్తానికి.. ఇంకా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అవ్వదు అని అనుకున్నా.. శంకర్- రామ్ చరణ్ సినిమాకి తాజాగా లైన్ క్లియర్ అయినట్లు అయింది.