తెలుగు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక సునామీ అని చెప్పవచ్చు. దీంతో నేడు ఆయన పుట్టినరోజు కావటంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. ఒకపక్క రాజకీయ నేతగా మరోపక్క హీరోగా పవన్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మరో పక్క అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకోవడం జరిగింది. పవన్ మిస్ చేసుకున్న చాలా సినిమాలు మిగతా హీరోలు చేసుకుని తిరుగులేని విజయాలు సాధించడం మాత్రమే కాదు ఇండస్ట్రీ హిట్ కూడా అందుకున్నారు. 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన “ఇడియట్” భారీ విజయం సాధించడం తెలిసింది. అప్పటి యూత్ లో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పవచ్చు.
ఈ సినిమా స్టోరీ “బద్రి” తీసిన తర్వాత.. పవన్ కళ్యాణ్ కి వినిపిస్తే ఆయన రిజెక్ట్ చేయడంతో రవితేజ చేయడం జరిగింది. ఇడియట్ మాత్రమే కాదు.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి సినిమాల స్టోరీలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కే పూరి వినిపించగా ఆయన రిజెక్ట్ చేయడంతో వేరే వాళ్ళు చేసి అదిరిపోయే విజయాలు అందుకోవటం జరిగింది. ఇక వీటితోపాటు సూర్య హీరోగా అప్పట్లో వచ్చిన “గజినీ” సినిమాని తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేయడం జరిగిందంట. కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని తెలుగులో డబ్ చేసి ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ అదిరిపోయే విజయాన్ని అందుకోవటం జరిగింది. ఇంకా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన “అతడు” సినిమా స్టోరీ మొదట పవన్ దగ్గరికి వెళ్ళగా ఆయన రిలీజ్ చేయడంతో మహేష్ చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంకా తరుణ్ నటించిన “నువ్వే కావాలి” కూడా పవన్ చేయాల్సిన సినిమా. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో తరుణ్ నటించిన ఆ సినిమాతో హీరోగా మొదటి ప్రయత్నంలోనే అందర్నీ బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇక “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కూడా పవన్ .. నటించాల్సిన సినిమా. చాలా వరకు పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ నటించిన తిరుగులేని హిట్స్ అందుకోవటం జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “మిరపకాయ” కూడా పవన్ మిస్ చేసుకున్న సినిమాయే. బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ పవన్ చేస్తుంటే ఆయన క్రేజ్ డబల్ త్రిబుల్ గా ఉండేది. మామూలుగానే ఇప్పుడు పవన్ సునామీకి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాలు పడుంటే.. పవన్ పాపులారిటీ మరోరకంగా ఉండేదని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.