K. Viswanath: కళాతపస్వి సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తారీఖు మరణించడం తెలిసిందే. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ” సినిమా ప్రపంచంలో కె విశ్వనాథ్ ఒక దిగ్గజం. గొప్పదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తీసిన చాలా సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి అని..ట్వీట్ చేసి ప్రధాని మోడీ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు. “విశ్వనాథ్గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు” అన్నారు.
ఇదే సమయంలో మహేష్ బాబు కూడా సంతాపం తెలిపారు.”సంస్కృతిని మరియు సినిమాని చాలా అందంగా ఒకచోట చేర్చిన మేధావి. ఆయన ప్రభావం సినిమా కంటే ఎక్కువగా విస్తరించింది. RIP కె విశ్వనాథ్ గారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం. ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. కే విశ్వనాధ్ తెలుగు జాతి ముద్దుబిడ్డ అని బాలకృష్ణ కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్ని చెప్పుకొచ్చారు. మన సంస్కృతి సంగీత సాహిత్యాల.. అవునత్యాన్ని తన సినిమాల ద్వారా నలదీసేలా చాటారని పొగిడారు. విశ్వనాధ్ సినిమాలు సందేశాత్మకంగా ఉండటమే కాకుండా కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటుతాయని తెలిపారు. ఒక విధంగా సినీ పరిశ్రమ పెద్ద దిక్కున కోల్పోయినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ…’తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఎంఎం కీరవాణి సైతం సంతాపం వ్యక్తం చేశారు.”నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి .. వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ” అనీ ట్వీట్ చేశారు.
డైరెక్టర్ త్రివిక్రమ్.. స్పందిస్తూ “ఒక యుగం ముగిసింది. ఆయన సినిమాలు కొన్ని తరాల నుండి కళాకారులకు.. సంస్కృతిని పెంచి పోషించింది. సినిమాకు ఒక గౌరవాన్ని మరియు గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి కళాతపస్సు శ్రీ విశ్వనాథ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్.. కె.విశ్వనాధ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ తో విశ్వనాధ్ ఎన్నో అద్భుతమైన చలనచిత్రాలు చిత్రీకరించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి ఈ మూడు సూత్రాలు కమలహాసన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ క్రమంలో విశ్వనాథ్ మరణం పట్ల ట్విట్టర్ లో కమల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “జీవిత పరమార్ధం, కలలకు ఉండే అమరత్వం గురించి కే విశ్వనాథ్ గారు చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన కళాతపచ్చి సృష్టించిన కళ ఆయన జీవిత కాలానికి మించిన మరణాంతరం కూడా వేడుకల సాగుతోంది. కలలకు చావు లేదు సెల్యూట్ మాస్టర్ అంటూ.. కమల్ ట్విట్ చేయడం జరిగింది.
ఇంకా రాజమౌళి, ఎం ఎం కీరవాణి, చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేష్, మణిశర్మ.. వంటి వారు కూడా వచ్చి విశ్వనాధ్ పార్తివదేహానికి నివాళులర్పించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూలస్థానం లాంటి వ్యక్తి లేకపోవడం బాధగా ఉందని, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీశారని.. పవన్ అన్నారు. ఇంకా చాలామంది నటీనటులు విశ్వనాధ్ పార్తివదేహాన్ని చివరి చూపు చూస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!