Vishnu vishal : ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోని ప్రముఖ సెలబ్రిటీలు, సెలబ్రిటీ కపుల్స్ అందరూ వారి హాలిడే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి హాలిడే వెకేషన్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు సైతం వారి పనులు పక్కకు పెట్టి హాలిడే వెకేషన్ మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు నుంచి టాలీవుడ్ సెలెబ్రిటీల వరకు మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలియా భట్, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి, సమంతా దంపతులు, రకుల్ ప్రీత్, మోహన్ బాబు కుటుంబం, కన్నడ రాకింగ్ స్టార్ యష్ మొదలైన వారందరూ కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లి మాల్దీవుల అందాలను చూస్తూ ఎంజాయ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ లిస్టు లో మరో ప్రేమ జంట కూడా చేరింది.
బ్యాడ్మింటర్ స్టార్ గుత్తా జ్వాల,తమిళ హీరో విష్ణు విశాల్ మాల్దీవుల్లో విహరిస్తున్నారు. మాల్దీవులకు వెళ్లిన ఈ ప్రేమ పక్షులు అక్కడ బీచ్ అందాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలను విశాల్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నారు. ప్రస్తుతం ప్రేమ జంట మాల్దీవుల వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి వీరి పెళ్లి ఎప్పుడంటే..
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, హీరో విష్ణువిశాల్ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు మనకు తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కూడా ఎంగేజ్మెంట్ నిర్వహించుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన ఈ జంట ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి విషయాలు ప్రకటించకుండా ప్రేమపక్షులు లాగ ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరి పెళ్లి ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అనే ఆశతో వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించారు. అదే విధంగా హీరో విష్ణు విశాల్ పలు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మొత్తానికి ఈ జంట మాల్దీవులలో దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారి వారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.