అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ఫిదా సినిమాతీసి బ్లాక్ బ్లస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ రొమాంటిక్ టీజర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసిది. శేఖర్ కమ్ముల ఎప్పటి లాగే తన మార్క్ బ్యూటి ఫుల్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా మిగిలిన బాగాన్ని చిత్రీకరించేదుకు శేఖర్ కమ్ముల సిద్దమయ్యారు.
అయితే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాలు ముందు సెట్స్ మీదకి వస్తాయనుకుంటే ఆ సినిమాల కంటే ముందే శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీ ని సెట్స్ మీదకి తీసుకు వెళుతున్నారు. ఇందుకోసం జూలై నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ చిత్రీకరించబోతున్నారట. అతి కొద్ది మంది చిత్ర యూనిట్ తో పాటు తక్కువ మంది నటీ నటులు మాత్రమే సెట్ లో ఉండేలా శేఖర్ కమ్ముల జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీ నారాయణదాస్ నారంగ్, శ్రీ పి. రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తుండగా అమిగోస్ క్రియోషన్ లో శేఖర్ కమ్ముల సమర్పిస్తున్నారు. ఇక థియోటర్స్ ఓపెన్ అయ్యాక సినిమాని రిలీజ్ చేస్తామని శేఖర్ కమ్ముల క్లారిటి ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఇదే మేకర్స్ తో శేఖర్ కమ్ముల ఒక స్టార్ హీరో మరో సినిమాని రూపొందించనున్నాడు.