తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాతల్లో ఎం.ఎస్.రాజు ఒకరు. ఈయన నిర్మాతే కాదు రచయిత కూడా. ఈ టాప్ ప్రొడ్యూసర్ దర్శకుడిగా మారి నిర్మాణ రంగంలో ఉన్న గ్రిప్ను కోల్పోయారు. తనయుడు సుమంత్ అశ్విన్ను హీరోగా నిలబెట్టుకునే ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. చాలా కాలంగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్న ఈయన మరోసారి నిర్మాతగా తన లక్ను పరీక్షించుకోనున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కాదు.. ఫలక్నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్. ఈ యువ హీరోకు ఎం.ఎస్.రాజు ఆల్ రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని ఈయన పరిచయం చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఎం.ఎస్.రాజు నిర్మాతగా మళ్లీ నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!