Karthika Deepam: బుల్లితెర పై ప్రసారమవుతున్న టీవీ సీరియల్ కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే ఇతర సీరియల్స్ కి లేదని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ సాధించినంత రేటింగ్స్ మరి ఏ ఇతర సీరియల్స్ కానీ టివి కార్యక్రమాలు గాని సంపాదించలేవని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటిస్తున్న దీప(ప్రేమి విశ్వనాథ్), కార్తీక్ (నిరుపమ్), సౌందర్య (అర్చన), మోనిత (శోభా శెట్టి) తదితరులు తమ పాత్రలకు ఎంతో న్యాయం చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. బుల్లితెరపై టాప్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీకదీపం తాజాగా మార్చి 30వ తేదీ 1000 వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్తీక్ అలియాస్ నిరుపమ్ ఈ సీరియల్ లో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కార్తీకదీపం సీరియల్ లో తన పాత్రలో నటించడం తనకు ఎప్పుడు బోర్ కొట్టలేదని, ఈ పాత్రలో ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయంటూ తన పాత్ర గురించి తెలిపారు. ఈ సీరియల్ లో దీపను అనుమానించడం మొదలు పిల్లలపై ప్రేమ ఈ విధంగా ఈ సీరియల్ లో తన పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయని, ఒక పాత్రలో ఇన్ని విధాలుగా నటించే అవకాశం ఎవరికీ దొరకదని కార్తీకదీపం సీరియల్ లో తన పాత్ర గురించి తెలియజేశారు.
తన పాత్ర తనకే నచ్చదన్న కార్తీక్:
ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఈ సీరియల్ లోని నా పాత్ర నాకే నచ్చలేదంటూ కార్తీక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఆధారం లేకుండా దీపను అవమానించి, బాధపెడుతూ ఆమెను కించపరిచే విధంగా మాట్లాడటం తనకు ఎంతో ఇబ్బందికరంగా ఉందంటూ తెలియజేశారు. బయటకు ఎక్కడికి వెళ్ళినా ఈ సీరియల్ లో దీపను ఇబ్బంది పెట్టడం గురించి అడుగుతున్నారని తెలిపారు. దీపకు ఎప్పుడు న్యాయం చేస్తావంటూ ఫోన్ కాల్స్, బెదిరింపు మెసేజ్ లు కూడా వచ్చాయని తెలిపారు. ఈ విషయం డైరెక్టర్, స్టార్ మా యాజమాన్యానికి చెప్పినప్పుడు తన పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కార్తీకదీపం సీరియల్ ఇంతలోనే పూర్తి కాదని ఇకనుంచి ఈ సీరియల్లో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని, ఇకపై అందరూ మెచ్చే విధంగా ఈ సీరియల్ ఉండబోతోందని నిరుపమ్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు