నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు చేయడానికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. సినీ అభిమానులకు మరింత చేరువకావడంలో ఈ ఫ్లాట్ఫామ్ చక్కగా ఉపయోగపడుతుండటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేకపోతున్నారు. తాజాగా ఒకనాటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్.. నెట్ఫ్లిక్స్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వయంగా నెట్ఫ్లిక్స్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. ‘దిల్ తో పాగల్ హై’ లాంటి న్యూస్ అంటూ తమ అప్ కమింగ్ వెబ్ సిరీస్లో మాధురీ దీక్షిత్, ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నటిస్తున్నారని సోమవారం అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని కరణ్ కూడా ధ్రువీకరించాడు. తమకు క్వీన్ దొరికిందంటూ ట్వీట్ చేశాడు. రాబోయే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మరింత అందంగా మారనుందని ఆయన వ్యాఖ్యానించాడు.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!