శరత్ కుమార్, రాధా రవిలను వెంటనే అరెస్ట్ చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 2017లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాధారవి పనిచేశారు. ఆ సమయంలో నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని ఎవరికీ తెలియకుండా అమ్మేశారు. ఈ స్థలం కాంచీపురం వెంకటామంగళం ప్రాంతలోని ఉంది. దీనిపై ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. కేసును పరిశీలించిన కోర్టు వెంటనే శరత్కుమార్, రాధారవిలను అరెస్ట్ చేయాలని, మూడు నెలల్లో కేసు దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.
previous post
next post