సూపర్స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `మహర్షి`. మహేష్ 25వ చిత్రమిది. దిల్రాజు, అశ్వినీ దత్, పివిపి నిర్మాతలు. సినిమా మే 9న విడుదలవుతుంది. రెండు పాటలు మినహా ఈ సినిమా టాకీ పార్ట్ అంతటినీ పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో ఈ రెండు పాటలను సెట్స్ వేసి చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత మహేష్ జూలైలో అనీల్ రావిపూడి సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.