సూపర్స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు, అశ్వినీదత్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను మే 9న విడుదల చేయబోతున్నారు. తొలి వెర్షన్ ఎడిట్ కట్ చూస్తే కంగారేసిందట. అందుకు కారణం ఈ వెర్షన్ మూడు గంటలకు పైగానే ఉందని సమాచారం. ఇంత లెంగ్తీ మూవీ అయితే ఏం చేయాలి? అనే ఆలోచన నిర్మాతలను అంతర్గతంగా లాగేస్తుంది. అందుకు కారణం ఒకట్రెండు సినిమాలు మినహా ప్రస్తుతం సినిమాలు రెండున్నర గంటలుంటేనే ప్రేక్షకులు సినిమా ల్యాగ్ అని ఫీల్ అవుతున్నాడు. అలాంటిది మూడు గంటల సినిమా అంటే ముందు థియేటర్కు రావడానికి ఆలోచిస్తాడు. ఏమాత్రం నెగటివ్ ఫీడ్ వచ్చినా.. ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి రిజల్ట్ బయటకు వచ్చేసిన తర్వాత కత్తెరకు పనిచెబితే ఉపయోగం కనిపించదు. మరి ఇలాంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే దిల్రాజు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడో చూద్దాం.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!