భారతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అమెరికాలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లడం తెలిసిందే. అక్కడ తెలుగువారితో పాటు చాలామంది ప్రముఖులు ఐకాన్ స్టార్ బన్నీకి బ్రహ్మరథం పట్టారు. బన్నీ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వెళ్లడం జరిగింది. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో.. అమెరికా దేశానికి చెందిన నాయకులు అక్కడ పాలకులు కూడా బన్నీతో తగ్గేదేలే తరహాలో ఫోజులిచ్చి ఫోటోలు దిగటం జరిగింది. అంతేకాదు తన మొట్టమొదటి సినిమా గంగోత్రి హీరోయిన్ తో కూడా అమెరికాలో బన్నీ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది.
అమెరికాలో జరిగిన ఈ భారత స్వాతంత్ర 75వ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే ఈ వేడుకకు బన్నీ కంటే ముందుగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మహేష్ బాబుని కలవడం జరిగిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో ఈవెంట్ నిర్వాహకులు సంప్రదించి మహేష్ నీ అతిథిగా తీసుకురావాలని కోరినట్లు టాక్.
అయితే ఆ టైంలో మహేష్ కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్పులో ఉండటంతో… కుదరకపోవడంతో.. తర్వాత బండికి ఆహ్వానం పంపిన వెంటనే దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో బండి ఓకే చెప్పినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది. “పుష్ప” క్రేజ్ తో అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వదేశీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం భారీ ఎత్తున వచ్చినట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!