సంక్రాంతి అంటే తెలుగువారి విశిష్టమైన పండుగే కాదు.. సినీ ప్రేక్షకులకు కూడా పెద్ద పండుగే. ఈ సీజన్లో ఏకంగా మూడు, నాలుగు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతాయి. సీజన్పై ఉన్న నమ్మకం అలాంటిది మరి. అదే నమ్మకంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యారు. వారిద్దరూ ఎవరో కారు.. ఒకరు సూపర్స్టార్ మహేశ్ అయితే మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మహేశ్, అనీల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ సినిమాను 2020, సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అనీల్ సుంకర ప్రకటించారు. కాగా.. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆసక్తికరమైన విషయమేమంటే… మహేశ్, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో పోటీ పడనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
previous post
next post