సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి పనుల్లో బిజీగా ఉన్నాడు. గత ఏడాదిగా ఇదే మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకోని లుక్స్ చేంజెస్ చేస్తున్న మహేశ్, త్వరలో పొల్లాచి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ అయిపోతే దాదాపు మహర్షి సినిమా టాకీ పార్ట్ పూర్తి అయిపోయినట్లే అవుతుంది. ఏప్రిల్ కి ఎలాగూ ప్రేక్షకుల ముందుకి వస్తుంది కాబట్టి ఈలోపు తన నెక్స్ట్ సినిమాని కూడా ఫైనల్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారం మహేశ్ బాబు నెక్స్ట్ మూవీ సుకుమార్ తో చేయాల్సి ఉంది, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ ఇప్పటి వరకూ కథ ఫైనల్ కాకపోవడంతో మహేశ్, తన మనసు మార్చుకోని అర్జున్ రెడ్డి సినిమాతో ఈ జనరేషన్ కల్ట్ క్లాసిక్ ని తీసిన సందీప్ రెడ్డి వంగకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడట.
అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాతే సందీప్, మహేశ్ బాబుని అప్రోచ్ అయ్యాడు కానీ అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే కొత్తవి సెట్ చేయాలని ఆలోచించాడట. అయితే సుకుమార్ కథని సిద్ధం చేసే పనిలో లేట్ చేస్తూ ఉండడంతో మహేశ్ బాబు సందీప్ రెడ్డి చెప్పిన లైన్ నచ్చడంతో, అతనితో ప్రొసీడ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న కబీర్ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది అది అయిపోగానే మహేశ్ బాబు-సందీప్ రెడ్డి వంగ మూవీ గ్రాండ్ గా ప్రాంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ తేజ్-బోయపాటి శ్రీను కలయికలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’, మితిమీరిన యాక్షన్ ఎపిసోడ్స్ వలన మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కన్నా ముందు బోయపాటి శ్రీను-మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ సెట్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వలన అది డిలే అయ్యింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయి ఉంటే ఇప్పుడు చరణ్ కి తగిలిన దెబ్బ మహేశ్ బాబుకి తగిలి ఉండేదని, అతని టైమ్ బాగుంది కాబట్టే మహేశ్ బాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు.