SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరించడంతో.. వీరి హ్యాట్రిక్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `SSMB 28` అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ను ఖరారు చేశారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కథకు అనుగుణంగా ఉండేలా `అర్జునుడు` అనే టైటిల్ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ చాలా పాతది, బాగా రొటీన్గా కూడా ఉంది. అయినప్పటికీ, ఈ సినిమాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. పైగా త్రివిక్రమ్కి `అ` అనే అక్షరం సెంటిమెంట్. ఆయన రూపొందించిన చిత్రాల్లో చాలా వరకు `అ` అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి.
`అతడు`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలన్నీ `అ`తోనే వచ్చాయి. వీటిలో అజ్ఞాతవాసి మినహా మిగిలిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ `అ` సెంటిమెంట్నే ఫాలో అవుతూ `అర్జునుడు` అనే టైటిల్ను త్రివిక్రమ్ ఫైనల్ చేశారని.. అది మహేశ్కు కూడా నచ్చిందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!