Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుండి బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బ్లాక్ బస్టర్ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. “సరిలేరు నీకెవ్వరు” సినిమా గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే మహేష్ కెరియర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్ సన్నివేశాలు అదరహో అనిపించాయి.
పరిస్థితి ఇలా ఉండగా కరోనా కష్టకాలంలో చాలావరకు సినిమాలు లేట్ అవుతున్న సిచువేషన్. ఇలాంటి తరుణంలో అతి తక్కువ టైమ్ లో మరోసారి అనిల్ రావిపూడి తో సినిమా చేసి… విడుదల చేయటానికి మహేష్ ప్లానింగ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల లో వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ కేవలం 90 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
అదే రీతిలో ఎంటర్టైనర్ సబ్జెక్టుతో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒకటి కన్ఫామ్ కాగా మరొకటి త్వరలో ఈ అనిల్ రావిపూడి సబ్జెక్టు కూడా కన్ఫామ్ కానున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ విని ఇది కూడా కన్ఫర్మ్ అయితే .. మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అంటున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!