Mahesh: మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ప్రిన్స్ గా హీరోగా పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగాడు.. మహేష్ బాబు ఇప్పటివరకు 27 చిత్రాలలో నటించారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మహేష్ బాబు కి ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. మురళీ మోహన్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన మహేష్ నేటి వరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.. అందుకు పునాది ఈరోజే..! అంత ప్రత్యేకత ఏమిటంటే.!?
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ అనే సినిమాతో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. 1979లో విడుదలైన ఈ సినిమాలో మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది . మహేష్ బాబు కూడా చక్కగా నటించడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్లు వచ్చాయి.. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం తొమ్మిది చిత్రాలలో నటించారు. అందులో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఏడు చిత్రాలలో నటించడం మరో హైలెట్ . సరిగ్గా 43 ఏళ్ల కింద ఇదే రోజు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు మహేష్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు..
చిన్నప్పటి నుంచే మహేష్ సినీ ప్రపంచంలో పెరిగారు. రాజకుమారుడు తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహేష్ ఎప్పుడు సినిమాల పట్ల సినీ ఇండస్ట్రీలోని పెద్దలపట్ల తెలుగు ప్రేక్షకుల పట్ల అమర్యాదగా నడుచుకోలేదు. క్రమశిక్షణతో, నిబద్ధతతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఈరోజు టాప్ హీరోలలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు . ప్రిన్స్ మహేష్ గా ఉన్న ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సూపర్ స్టార్ మహేష్ బాబు గా గుర్తింపు చేచుకున్నరు. రీసెట్టుగా సర్కారు వారి పాట సినిమాతో థియేటర్లలో సందడి చేయగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.