Mahesh Babu: టాలీవుడ్ గ్లామర్ బోయ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రస్తావన అవసరం లేదు. ఇటీవల రిలీజైన ‘సర్కారు వారి పాట’ సినిమా రిజల్ట్ ఎలా వున్నా, వసూళ్ల విషయంలో సంబరపడుతూ సినిమా చిత్ర యూనిట్ ఇటీవల జయోత్సవ కార్యక్రమాలను జరిగిపిన సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమాలు ముగించుకుని మన రాజకుమారుడు తన కుటుంబంతో యూరప్ వెకేషన్ చెక్కేసాడు. తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోని మహేష్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. దాంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే ఆ ఫోటో తంతు:
ఇది ఓ సెల్ఫీ చిత్రం లాగా కనబడుతుంది. నమ్రత, గౌతమ్, సితార, మహేష్ అంతా కలిసి దిగిన ఈ ఫోటో అభిమానులను అలరిస్తుంది. మహేష్ కూలింగ్ గ్లాసెస్ ధరించి మరింత కూల్ గా కనిపిస్తున్నారు. ఇక ఇందులో నమ్రత కూడా అద్దాలు ధరించడం మనం గమనించవచ్చు. పిల్లలు సితార, గౌతమ్ ఇద్దరూ నవ్వుతూ మంచి ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. కాగా ఈ ఫోటోని ఉద్దేశించి అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ… లుకింగ్ గార్జియస్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
యూరప్ మహేష్ ఫేవరేట్ స్పాట్!
అవును.. మహేష్ అనేక సందర్భాలలో యూరప్ తన ఫేవరేట్ వెకేషన్ స్పాట్ అని చెప్పడం మనకు తెలిసినదే. ఇప్పుడనే కాదు, మహేష్ ఖాళీ సమయం దొరికితే కుటుంబంతో కలిసి యూరప్ విమానం ఎక్కేస్తారు. దాదాపు ఓ వారం రోజుల పాటు యూరప్ అందాల్లో మునిగి తేలుతారు. కొన్నేళ్లగా మహేష్ ఫ్యామిలీ ఎక్కువగా యూరప్ కే వెళ్తుంది. అక్కడి అందమైన లొకేషన్లు చూడటానికి ఎన్నిసార్లు వెళ్లిన సమయం సరిపోదని..అక్కడ ప్రెష్ ఫీల్ కల్గుతుందని మహేష్ అంటుంటారు. నమ్రత పిల్లలతో కలిసి వెళ్లినా ఎక్కువగా యూరప్ కే వెళ్తుంటారు. బాగా తెలిసిన ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అన్ని రకాల సౌకర్యాలు యూరప్ లో చక్కగా కుదురుతాయని అంటుంటారు.