Acharya : మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కొంత కాలం సినిమాలకు విరామం ఇచ్చి, ఖైదీనెంబర్150 చిత్రం ద్వారా తన 150వ చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పవచ్చు. చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.అయితే ఈ ట్రైలర్ ని చూసిన కొందరు అభిమానులు ఈ సినిమా మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాను పోలి ఉంటుందని భావిస్తున్నారు.
చిరంజీవి ఆచార్య సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ట్రైలర్ చూసిన వారందరూ కూడా ఈ సినిమా కథాంశం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే కొందరు ఆచార్య సినిమా కథ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా మాదిరి ఒక ఒక మారుమూల గ్రామాన్ని ఆక్రమించుకోవడానికి వస్తే వారితో గొడవ పడి వారిని మహేష్ బాబు రక్షిస్తారు.అదేవిధంగా ఆచార్య సినిమా ట్రైలర్ ని చూస్తే మహేష్ ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది అంటూ మహేష్ అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ చూసిన ఎంతోమంది మహేష్ అభిమానులు ఇది ఖలేజా మూవీ కథ లాగే ఉందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ పాత్ర గురించి తెలిస్తే తప్ప ఆచార్య సినిమా ఏ తరహా కథాంశంతో తెరకెక్కుతున్నదనే విషయంపై క్లారిటీ వస్తుంది.ఈ విధంగా అటు మహేష్ అభిమానులు ఇటు మెగా అభిమానులు ఆచార్య సినిమా గురించి తీవ్ర స్థాయిలో చర్చలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఆచార్య టీజర్ చూస్తుంటే చిరు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా గురించి ఫుల్ క్లారిటీ తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందేనని తెలుస్తోంది.