Rajamouli-Mahesh: దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి తరుణంలో రాజమౌళిపై మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. మహేశ్ నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట` మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మాత్రం అదిరిపోయే కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్పై టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించకపోవడంతో మహేష్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ టైమ్లో ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్ ఇంకాస్త ఇబ్బంది పెట్టింది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన `డాన్` సినిమా ఇటీవలె విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్పై స్పందిస్తూ.. `డాన్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ అని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్ చేసింది.
ఇంకేముంది రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తాన్ని మహేశ్ ఫ్యాన్స్ ఏకేస్తున్నారు. సర్కారు వారి పాట ఒక్క ట్వీట్ కూడా చేయలేదు కానీ.. తమిళ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయం, ఆర్ఆర్ఆర్ కోసం తన సినిమాను రెండు సార్లు వాయిదా వేసుకున్న మహేశ్కు బాగా బుద్ధి చెప్పారు అంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు. కొందరైతే హద్దులు దాటి బూతులు కూడా తిట్టేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.