Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కీర్తి సురేష్తో కలిసి `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మిస్తున్నారు.
2020లో ప్రారంభమైన ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది. సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరకోగా.. మహేష్ బాబు ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ప్రకటించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఇది పూర్తైన వెంటనే మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ ఓ మాస్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. బోయపాటి శ్రీను.
ఇటీవల `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బోయపాటి.. తాజాగా మహేష్ ను కలిసి ఓ అదిరిపోయే స్టోరీ లైన్ వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమైతే.. మహేష్ ఫ్యాన్స్కు పూనకాలు ఖాయమని అంటున్నారు. కాగా, బోయపాటి ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.