Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” మొదలుకొని.. ఆ తర్వాత మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. రీసెంట్ గా “సర్కారు వారి పాట” తో విజయాలు సాధించడం జరిగింది. హీరోగా మంచి జోరుమీద ఉన్న మహేష్ నిర్మాతగా కూడా “మేజర్” సినిమాతో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“మేజర్” సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మేజర్” సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. ముంబై 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అడవి శేష్ నట విశ్వరూపం చూపించాడు. ప్రకాష్ రాజు ఇంకా చాలా మంది ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. దేశభక్తి నేపథ్యంలో… జవాన్ కుటుంబాల భావోద్వేగాలను కళ్ళకి కట్టినట్లుగా.. వెండితెరపై దర్శకుడు శశికిరణ్ అద్భుతం గా చూపించడం జరిగింది. మేజర్ క్లైమాక్స్ చూసిన చాలామంది కంటతడి పెట్టారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు అందరూ మేజర్ సినిమా విజయం మాత్రమే కాకుండా దేశం కోసం పని చేస్తున్న జవాన్ కుటుంబాలకు గౌరవం తెచ్చిన సినిమా అని కితాబిస్తున్నారు.
అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సాధిస్తుంది. ఇటువంటి తరుణంలో నిర్మాతగా మహేష్ బాబు ప్రారంభంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ తర్వాత.. సినిమా రిలీజ్ అయిన టైం లో ఫ్యామిలీ తో యూరప్ ట్రిప్ లో ఉండటం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన హైదరాబాద్ చేరుకోవడంతో ఇప్పుడు మేజర్ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారట. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత సినిమా యూనిట్ తో.. ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ మహేష్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేజర్ హీరో హీరోయిన్లతో పాటు డైరెక్టర్ పాల్గొనబోతున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!