సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ డాన్స్ షోలో సందడి చేయడం జరిగింది. జీ తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తున్న “డాన్స్ ఇండియా డాన్స్ రియాల్టీ షో” లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో లో మహేష్ మాట్లాడుతూ డాన్స్ అనేది నా దృష్టిలో ఒక సెలబ్రేషన్. ఈ షో కి మా అమ్మాయితో కలిసి రావటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఇదే ప్రోమోలో “సర్కారు వారి పాట” లో పెన్ని సాంగ్ వేయగా… సితార చాలా ఎనర్జిటిక్ గా షో స్టేజిపై డాన్స్ వేసింది.
ఈ షో ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్లాసికల్ డాన్స్ లతో పాటు తండ్రి మహేష్ సినిమాలకు సంబంధించి అనేక పాటలకు స్టెప్పులు వేస్తూ వీడియోలు చేస్తూ ఎంతగానో అలరిస్తూ ఉంటది. “సర్కారు వారి పాట” రిలీజ్ అయ్యే క్రమంలో…పెన్ని సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో సితార స్టేపులు వేసిన ప్రోమో వీడియో… అప్పట్లో ఎంతో వైరల్ గా మారింది.
చాలా ఎనర్జిటిక్ గా సితార కనిపించింది. ఈ క్రమంలో మరోసారి ఇప్పుడు ఏకంగా తండ్రితో టెలివిజన్ టీవీ షో కార్యక్రమంలో సితార పాల్గొనటం సంచలనంగా మారింది. చూస్తుంటే మెల్లమెల్లగా కూతురిని మహేష్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్..” SSMB 28″ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకేక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.