Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క నటుడిగా మరోపక్క నిర్మాతగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో కెరియర్ కొనసాగిస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుండి వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం జరిగింది. మహమ్మారి కరోనా తర్వాత రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత… మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాటతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. గత నెలలో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఈ సినిమా చేస్తూనే మరో పక్క నిర్మాతగా అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో “మేజర్” నిర్మించడం జరిగింది. ఆర్మీ లో కీలక అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు సైతం “మేజర్” సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముంబై దాడులు 26/11 నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రని ప్రధానాంశంగా తెరపై అద్భుతంగా దేశభక్తిని అదే రీతిలో దేశం కోసం పోరాడే జవాన్ కుటుంబ భావోద్వేగాలనీ రక్తి కట్టించే రీతిలో తెరకెక్కించడం జరిగింది. సినిమా చివరి అరగంట.. చూసే ప్రేక్షకుల హృదయాలను పిండేసింది. ఇదంతా పక్కన పెడితే సినిమా విజయం సాధించడంతో నిర్మాతగా మహేష్ బాబు తొలిసారి సినిమా హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాను ఫస్ట్ టైం మేజర్ చూసినప్పుడు.. ఎంతో తనని టచ్ చేసిందని ముఖ్యంగా చివరి అరగంట చూసిన తర్వాత ఐదు నిమిషాలు మాట్లాడలేకపోయాను. ఆ తరువాత అడివి శేష్ కి షేక్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది అని తెలిపారు. ఇదే సమయంలో అసలు బయోపిక్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ మరోపక్క సినిమా స్టోరీ క్యారీ చేయడం… దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. కాని మేజర్ నీ అద్భుతంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు..అంటూ సినిమా యూనిట్ మొత్తాన్ని నిర్మాతగా మహేష్ బాబు ఈ కార్యక్రమంలో ప్రశంసించారు.