Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిసున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక సినిమాకి సంబంధించి విడుదలవుతోన్న ప్రతి అప్డేట్కు ప్రేక్షకుల నుండి మంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే, ‘సర్కారు వారి పాట’ సినిమాలోని మొదటి రెండు పాటలు కళావతి, పెన్నీ రిలీజై బ్లాక్బస్టర్స్గా నిలిచాయి.
ఈ క్రమంలో చిత్రబృందం రిలీజ్ చేయబోతున్నారు. ఈ 3వ సింగిల్ కోసం మహేశ్ అభిమానులే మాత్రమే కాకుండా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఈ 3వ పాటకి సంబంధించిన అప్డేట్ను చిత్రయూనిట్ వెల్లడించింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో 3వ పాట టైటిల్ సాంగ్. దీనిని ఈ నెల 23వ తేదీన ఉదయం 11గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతు న్నట్లుగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేశారు.
Mahesh Babu: 8 ఏళ్ళ తర్వాత మహేశ్ సినిమాకి థమన్ సంగీతం..
ఇక ఈ పాట ట్యూన్ను సినిమా టీజర్కు అలాగే, బీజీఎంకు కూడా ఉపయోగించారు. మ్యూజికల్ సెన్సేషన్ గా ఇప్పుడు టాలీవుడ్లో సత్తా చాటుతున్న సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ ఆల్బమ్ కోసం అద్భుతమైన సౌండ్ ట్రాక్లను కంపోజ్ చేశాడు. 8 ఏళ్ళ తర్వాత మహేశ్ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండటంతో కసిగా సాంగ్స్, బీజీఎం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు ఇప్పటికే విడుదలైన పాటలు చూస్తుంటే అర్థమవుతోంది. కాగా, సినిమాకు సంబంధించి ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్, అలాగే..కొందరు డ్యాన్సర్లపై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట కోసం వేసిన ఓ భారీ సెట్లో షూట్ చేస్తున్నారు. మే 12న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.