Mahesh Babu: `సర్కారు వారి పాట`తో మరో హిట్ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అవ్వగా.. నందమూరి హీరో తారకరత్న విలన్గా కనిపించబోతున్నాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. బాలనటుడిగా ఉన్నప్పుడు తండ్రి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `కొడుకు దిద్దిన కాపురం` చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. అయితే హీరోగా మారిన తర్వాత తన ఇన్నేళ్ల కెరీర్లో ఏ ఒక్క సినిమాలోనూ మహేశ్ డ్యూయల్ రోల్ చేసింది లేదు.
కానీ, త్రివిక్రమ్ తెరకెక్కించబోయే చిత్రంతో తొలిసారిగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఆయన పోషించబోయే రెండు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే అభిమానులకు కన్నుల పండగే అవుతుంది. కాగా, త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా చిత్రాలు బాగానే అలరించడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.