టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు తో మహేష్ దూసుకు పోతున్నాడు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అంటూ “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నట్లు మహేష్ ప్రకటించడం అందరికీ తెలిసిందే. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది.
ఇదిలా ఉండగా కమర్షియల్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న తరుణంలో సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల గురించి మహేష్ వద్ద డైరెక్టర్ పరుశురాం డిస్కషన్ చేయగా…. నమ్రత అలాంటి సన్నివేశాలకు నో చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఐటమ్ సాంగ్ మరియు రొమాంటిక్ సీన్లు ఉన్న పర్వాలేదు కానీ లిప్ లాక్ సీన్స్ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్ లో ఉండకూడదని….
ఆ సన్నివేశాల్లో మహేష్ ని చూడలేను అన్నట్టుగా పరశురామ్ దగ్గర నమ్రత అన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో నమ్రత కి ఎదురు చెప్పలేక పరుశురాం అలాంటి సన్నివేశాలను స్క్రిప్ట్ లో నుంచి తొలగించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే ఆలోచనలో మహేష్ వున్నట్లు సమాచారం.