Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ అదేవిధంగా మహేష్ నిర్మాణ సంస్థ, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయింది. దీంతో రంగంలోకి దిగారు మహేష్ బాబు. మొదటి షెడ్యూల్ దుబాయ్ దేశంలో విజయవంతంగా పూర్తి చేయగా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ఈ రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో..కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ ఇప్పటికే 3 సాంగ్స్ కంప్లీట్ చేయడం జరిగిందట. సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అని కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్.