Mahesh Babu: మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ అయ్యి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అయిపోయింది. గత ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి మహేష్ కెరీర్ లోనే అత్యధిక రికార్డు కలెక్షన్లలను రాబట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత మహమ్మారి కరోనా రావడంతో ప్రస్తుతం పరిస్థితులు బట్టి చూస్తే మహేష్ కెరీర్లోనే.. ప్రస్తుతం వచ్చిన గ్యాప్ అతిపెద్ద గ్యాప్ అని అంటున్నారు. ఇటువంటి తరుణంలో తర్వాత పరిస్థితులు చాలా వరకు దేశంలో ఉన్న నేపథ్యంలో… ఒప్పుకున్న సినిమా షూటింగులు చకచకా కంప్లీట్ చేయాలని మహేష్ బాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.
ప్రస్తుతం మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 40 శాతం అయిపోయింది. అయితే మిగిలివున్న షూటింగ్ మొత్తం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి.. వచ్చే సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా కాకుండా త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసి కేవలం ఆరు నెలలోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట.
Read More: Mahesh : మహేష్కి జంటగా నివేథా థామస్..?
త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టి దాదాపు సంవత్సరంన్నర కావడంతోపాటు లాంగ్ గ్యాప్ తనకి కూడా రావడంతో.. మహేష్ బాబు తో చేయబోయే మూడో సినిమా షూటింగ్ షెడ్యూల్ పక్క గా వేసుకుని.. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన ఆరు నెలలకే .. త్రివిక్రమ్ మహేష్ సినిమా రిలీజ్ చేయాలని.. గట్టిగా డిసైడ్ అయినట్లు ఇప్పటికే స్క్రిప్ట్ నటీనటులు మొత్తం పక్కాగా ఉండేలా ఎక్కడా కూడా టైం వేస్ట్ అవకుండా షెడ్యూల్స్ త్రివిక్రమ్ జాగ్రత్తగా వేస్తున్నట్లు సమాచారం.