Mahesh Babu: “సర్కారు వారి పాట” సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు..త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్టులు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబంతో యూరప్ ట్రిప్ లో ఉన్న మహేష్.. ఇండియాకి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టనున్నారు. ఇటీవల స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో జూన్ నెలలో మొదలు కావాల్సిన త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జూలై మాసంలో పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. గతంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ అతడు , ఖలేజా వంటి రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రెండు సినిమాలలో కూడా అంతకుముందు ఎన్నడూ ఎప్పుడూ చూడని మహేష్ నీ నటనాపరంగా త్రివిక్రమ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. దీంతో మూడో సినిమాలో మహేష్ బాబు ని ఏవిధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా అభిమానుల్లో నెలకొంది. మరో పక్క రాజమౌళి మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్టు విషయాల్లో.. ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది అని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో మహేష్ పుట్టినరోజు నాడు రాజమౌళి సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే మరో మాస్ డైరెక్టర్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ఇదే బ్యానర్ పై సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అంతా బాగుంటే మహేష్ బాబు తో గోపీచంద్ మలినేని నీ పెట్టి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. మహేష్ కూడా ఈ ప్రాజెక్టుపై పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.