దాదాపు నాలుగు సంవత్సరాల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇంకా కరోనా తర్వాత ఇటీవల సర్కారు వారి పాట సినిమాలతో నాలుగు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ మహేష్ అందుకోవటం జరిగింది. ఇక ఇదే సమయంలో నిర్మాతగా కూడా మహేష్ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల మహేష్ బాబు నిర్మించిన “మేజర్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకపక్క హీరోగా మరో పక్క నిర్మాతగా సక్సెస్ఫుల్ కెరియర్ సాగిస్తున్న మహేష్ బాబు వ్యాపారవేత్తగా కూడా రానిదించడం జరుగుతోంది. మహేష్ బాబుకి సొంతంగా “AMB” అనే భారీ మల్టీప్లెక్స్ థియేటర్ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ థియేటర్ లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు “AMB” బ్రాంచ్ లను మెట్రోపాలిటన్ సిటీలలో నిర్మించాలని.. వ్యాపారం విస్తరించి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ముందుగా బెంగళూరు, చెన్నై మరియు కొచ్చిన్ నగరాలలో మల్టీప్లెక్స్ థియేటర్ లు నిర్మించడానికి మహేష్ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలావరకు ఎంటర్టైన్మెంట్ కోరుకునే సినీ ప్రేమికులు తక్కువ రోజులు మాత్రమే సినిమా ధియేటర్ లో ఉండే పరిస్థితి.. నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో సౌత్ లో ప్రధాన నగరాలను టార్గెట్ గా పెట్టుకుని మహేష్ “AMB” థియేటర్లను విస్తరించే ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్.. ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మధ్యలో టైం గ్యాప్ రావడంతో నిర్మాతగా మహేష్ పలు సినిమాలు నిర్మించడానికి పలు కథలు వింటున్నట్లు సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!