Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్న హీరోగా మహేష్ బాబు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు విజయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకోవడం జరిగింది. కాగా వీటిలో గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా మహేష్ కెరీర్ లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వెళ్తే.. సరిలేరు నీకెవ్వరు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసపెట్టి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం “ఎఫ్ త్రీ” సినిమాకి సీక్వెల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రవితేజతో చేసిన “రాజా ది గ్రేట్” సినిమా కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో మహేష్ బాబు తో చేసిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా కి కూడా సీక్వెల్ చేయడం గ్యారెంటీ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో అన్నది అనిల్ రావిపూడి స్పందిస్తే బాగుంటుంది.
ప్రస్తుతం మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి “ఎఫ్ త్రీ” ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలోనే “సరిలేరు నీకెవ్వరు” సినిమా హిట్ అయిన సమయంలో మహేష్ తో అనిల్ రావిపూడి సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇలాంటి తరుణంలో సీక్వెల్ అంటూ వస్తున్న వార్తల పై మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టు నిజంగా ఓకే అయితే నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?